నాసిరకం భోజనం మాకొద్దు..మంచిర్యాల జిల్లాకుశ్నపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల స్టూడెంట్స్  ధర్నా

నాసిరకం భోజనం మాకొద్దు..మంచిర్యాల జిల్లాకుశ్నపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల స్టూడెంట్స్  ధర్నా

బెల్లంపల్లిరూరల్, వెలుగు: నాసిరకం భోజనం మాకొద్దని ఆదివారం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం కుశ్నపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల స్టూడెంట్స్​ప్రధాన గేట్​ ముందు ధర్నా చేపట్టారు. చాలీచాలని పప్పు  నీళ్లతో భోజనం వడ్డిస్తున్నారని వార్డెన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

స్టూడెంట్స్​ ధర్నాకు ఏఐఎస్​బీ సంఘం నాయకులు, సర్పంచ్​కొండగొర్ల గంగారాం మద్దతు తెలిపి ధర్నాలో బైఠాయించారు. వారు మాట్లాడుతూ.. సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే హాస్టల్​ సమస్యలను బయటకు ఎందుకు తెస్తున్నారని స్టూడెంట్స్​ను బెదిరించారని ఆరోపించారు. స్కూల్​కు రూ.75 వేల గ్రాంట్​ వస్తే ఎలాంటి పనులు చేపట్టలేదని, కనీసం సౌకర్యాలు కానరావడం లేదన్నారు.

డీటీడబ్ల్యూఓ రమాదేవి, ఏటీడబ్ల్యూఓ సురేశ్​ధర్నా చేపడుతున్న వారితో ఫోన్​లో మాట్లాడి సిబ్బందిపై చర్యలు తీసుకొని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో స్టూడెంట్స్​ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్​ బైరి సాయి, వార్డు సభ్యుడు దేవాజీ, స్థానిక యువకులు పాల్గొన్నారు.